Pages

Subscribe:

Sunday, August 31, 2008

ఉపన్యాసము , రాజకీయము విడదీయరాని ఓహ్ బంధము .రాజకీయ నాయకుని అమ్ముల పొదిలో ఉపన్యాసము ఓ బ్రహ్మస్రము వంటిది , కాని ఆ బ్రహ్మస్రాన్ని తెలియని వారు వుపయోగిస్తే ఎలావుంటుంది ....ఎంతసేపు కనిపించమా అని కాకుండా ఎంతమేరకు నవ్వించాము అన్నదే సర్కస్ లోని జోకర్ ప్రార్ధన లక్షం,అలాగే ఎంతసేపు మాట్లాడానా అని కాకుండా ఎంత బాగా మాట్లాడానన్నదే వుపన్యాసకుడి ఆలోచన .... కాని కొన్ని ఉపన్యాసాలు అపహాస్యాల పాలవుతుంటాయి......

సరిగ్గా అలాంటిదే ఈ మద్య మన రాష్ట్రం లోను చోటు చేసుకుంది.....

వరంగల్ జిల్లా ,పరకాల మండలంలోని ఓ పార్టీ సమావేశానికి హోం మంత్రి జానా రెడ్డి గారు హాజరయ్యారు , అక్కడ కొందరు ఉపన్యాసకులు నానా రభస చేసారు , కొందరు పద్యాలూ కొందరు ఏకంగా పాటలు పాడారు.....ఇక ఒక మహిళా ఏకంగా తన పార్టీ సిద్దంతాల్నే కాల రాస్తూ తన పార్టీ కే సంభందించిన ఓ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు , అది చూసి తరలి వచ్చిన జనం ముక్కున వేలేసుకున్నారు ........హోం మంత్రి జాణ రెడ్డి సాక్షిగా జరిగిన ఈ పేరడీ సన్నివేశంలో ఇంకా అనేక హాస్య రసాలు దాగి వున్నాయి....వాటిని అక్షర బద్దం చేయడం కంటే తిలకించడమే చాలా మంచిదని ఇక్కడ ఉంచడం జరిగింది......

పైన ఉదహరించబడిన అంశము నిజంగా జరిగినదే అయినా మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎలంచి పక్షపాత వైఖరిని ప్రదర్శించడం లేదు , ఈ విషయం ఎవరిని కిన్చపరచదని, ఎవరి మనస్సులని భాద పెట్టదని భావిస్తున్నాను ....

ఒక మనవి : Now you can visit my blog as " http://www.aradhanaa.co.cc/".

Sunday, August 24, 2008

ఒకరికి కోపం వచ్చి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్రేకం అంటారు ,కాని నలుగురు కలిసి తిరుగుబాటు చేస్తే దాన్ని ఉద్యమం అంటారు .సామ్యవాద ప్రయోజనాల కోసం పోరాడుతూ మాత్రు మూర్తి దాశృంఖలాల మద్య నలిగిపోతున్న పీడిత ప్రజలకు ఒక ద్రువతార కన్పించింది ,కాని ఆ ద్రువతార ఎక్కువసేపు నిలవక పోయినా కావలసినంత ఉత్తేజాన్ని తన కాంతితో నింపి వెళ్ళిపోయింది , ఆ ద్రువతారే చేగువేరా .

విప్లవాన్ని అనిచివేయలేరేమో గాని ఆపి వేయలేరన్న జగమెరిగిన సత్యాన్ని ముందుగానే గ్రహించినట్లుగా నేనుసైతం అంటూ ముందుకు నడచి నలుగురిని నడిపించిన నాయకుడాయన .విప్లవానికి అంకురం లూయిబ్లాంక్ ,అర్పణ చేసింది కారల్ మార్క్స్ అయితే , జ్యోతి వెలిగించింది మాత్రం ఖచ్చితంగా చేగువేరా నే ...

చే అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా,అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.చిన్నతనం నుంచి ఆస్థమాతో బాధపడే ఎర్నెస్తో అనే చెగెవారాలో కార్యదీక్ష, పట్టుదలతో పాటు సున్నిత మనస్థత్వం వున్నాయి. అందుకే ఇంజనీరింగ్‌ చదివి మెడిసిన్‌లో చేరాడు.1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడుడాక్టర్‌గా వెనిజులా వెళ్లి కుష్ఠురోగుల ఆస్పత్రిలో పనిచేయాలని సంకల్పించాడు.కాని అప్పటి కే అర్జెంటీనా ఇతర లాటిన్‌ ఆమెరికా దేశాల్లో రైతుల, ఇండియన్‌ తెగల ప్రజల మీద అమెరికన్‌ సామ్రాజ్యవాదులు ఎంతో కాలంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఆ దేశాల రాజకీయ వ్యవస్థ, ఆర్థిక సంపదలను అమెరికా ప్రభుత్వం, సిఐఎ నియంత్రిస్తుంటాయి. వారి అధిపత్యాన్ని స్థానిక ప్రభుత్వాలు ఏమాత్రం వ్యతిరేకించినా వెంటనే ఆ ప్రభుత్వం పతనం కాక తప్పదు.అప్పుడు చే మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తూ ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు,హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.

అలా విప్లవాగ్నిలో రగిలిపోతూ గెరిల్లా సేనలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రవేశించి, కమాండర్‌ స్థాయికి ఎదిగినా ఎలాంటి ప్రత్యేకతలను, ఎవరికీ లేని సౌకర్యాలను తీసుకోవడానికి నిరాకరించాడు,కాని సరిగ్గా అప్పుడే "చెరకు పంటకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన క్యూబా మీద ఎంతోకాలంగా అమెరికా సర్వాధికారాలను చలాయిస్తుంటుంది. అనేక లాటిన్‌ అమెరికన్‌ దేశాలలో వలెనే క్యూబాలో కూడా అధ్యక్షుడు బతిస్తా అమెరికా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంటాడు. ఫిడెల్‌ కాస్ట్రో అనే యువ న్యాయవాది నాయకత్వంలో కొందరు యువకులు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. చే వారితో చేతులు కలిపాడు.క్యూబా దేశీయుడు కాకపోయినా, పరాయి దేశం లోని ప్రజల కష్టాలకు స్పందించి వారి విముక్తి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన చే దృక్పథం, సార్థరాహిత్యం ఫిడెల్‌ కాస్ట్రోను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరిగ్గా ఈ పోరాట సమయంలోనే చేగువేరా చే గా పిలవబడ్డాడు, ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయి విప్లవకారులకి చేదోడు గా నిలిచిపోయింది ,కాని ఆంగ్లంలో చే అంటే విడదీయలేని స్నేహితుడు అని అర్థం .

అలా పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా,క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు.
గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు.

"జీవితంలో ఏదయినా సాధించాలంటే అన్నింటిని , అందరిని వదులుకోవటానికి సిద్ధంగా ఉండాలి " అంటూపేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన చే 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం వదలి కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగో లో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించాడు,ఆ సమయంలో తన లక్ష్యం గురించి తన పిల్లలకి చే రాసిన చివరి ఉత్తరం ఇది ....

ప్రియమైన హిల్లితా అలిదితా కామిలో సెలీనా ఏర్నేస్తో ....నేను మీతో లేను కాబట్టి కొన్ని సంగతులు చెప్పేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను ,ఏదో ఒకనాటికి మీకు ఇది అందినపుడు మీరు ఇవన్ని తెలుసుకుంటారు.

ప్రపంచంలో ఎక్కడ ఎవరికీ అన్యాయం జరిగినా స్పందించడం చాల అవసరం , ప్రతి విప్లవకారుడికి ఉంది తీరాల్సిన లక్షణం ఇదే ....


నా పిల్లలందరికీ వీడ్కోలు పలుకుతున్నాను , మిమ్మల్ని మల్లి కలుస్తాననే నా ఆశ ...

అలింగానాలతో చే ....

1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియాలో గెరిల్లా యుద్ధ కార్యకలాపాలు నడుపుతున్నచేగువేరా అమెరికన్‌ గూఢచార సంస్థ సి.ఐ.ఎ. ఏజెంట్‌ రోడ్రిగ్జ్‌ ఫిలిప్స్‌ నేతృత్వంలోని బృందానికి పట్టుబడ్డాడు. ఆ రాత్రికే వారు 'చే'ను సమీపంలోని 'లా హిగువేరా' గ్రామానికి తరలించారు. అక్కడ ఉన్న ఒక స్కూలులో చే ను బందించి అధికారుల ఉత్తర్వుల కోసం వేచివున్న సైన్యం మరుసటి రోజు మద్యాహ్నం (అక్టోబరు 9) ఒంటిగంటా పదినిమిషాలకు మారియో టెరాన్‌ అనే బొలీవియన్‌ సార్జెంటు చేగువేరాను కాల్చిచంపాడు. , తన చివరిమాటగా తుపాకి ఎక్కుపెట్టినపుడు " కాల్చండి ,మీరు మనిషిని మాత్రమే చంపగలరు (విప్లవాన్ని కాదు) " అంటూ నేలకోరింది ఆ ద్రువతార.

అప్పుడక్కడ పనిచేస్తున్న స్కూల్ టీచర్ మాటల్లోనే ...

"అప్పుడు నేను నా బాధ్యతల్ని నిర్వర్తించ దానికి ఆ గ్రామానికి వెళ్ళాను ,కాని అప్పడికే స్కూల్లో చే నిర్భందించారని నాకు తెలియదు ,సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో నాకో పెద్ద శబ్దం వినిపించింది , తీర అక్కడికి వెళ్లి చూస్తె గుమ్మానికి కుడివైపున చే చేతుల్ని చాచి రక్తపుమడుగులో కొట్టు కుంటున్నాడు ."

ఇక టెరాన్‌మాటల్లో ..

విలేఖరి : చేని హత్య చేసిన వాలన్టిర్లలో మీరే మొదటగా కాల్చారని అంటున్నారు ?

టెరాన్‌ : ఇది ఖచితంగా అబద్దం అప్పుడు మము అయిదుగురు వున్నాము , కాని అపటికే చే గాయాలతో మరణానికి చేరువలో వున్నాడు ...


అనంతరం మృతదేహాన్ని హెలికాప్టర్‌లో సమీప పట్టణమైన వ్యాలీగ్రాండ్‌కు తరలించి అక్కడి ఓ ఆసుపత్రిలో విలేకరులకు ప్రదర్శించారు. అలా మూడురోజులపాటు అక్కడే ఉంచి చే రెండుచేతుల్నీ తొలగించారు(అందుకు స్పష్టమైన కారణాలేంటో ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు). ఆ తర్వాత ఆయన భౌతిక కాయాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి పంపారు. అక్టోబరు 15న చే మృతి గురించి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్‌క్యాస్ట్రో అధికారికంగా ప్రకటించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వ్యాలీగ్రాండ్‌ ప్రాంతంలో చేతులు లేని ఓ అస్థిపంజరం బయటపడింది. పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్‌ అధికారులు అవి చే తాలూకూ ఆనవాళ్లే అని నిర్ధరించారు. చివరకు 1997 అక్టోబరు 17న శాంటాక్లారా(క్యూబా)లో సైనికలాంఛనాలతో ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపింది.

"ఆగిపోయిన గడియారం కూడా రెండు సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంటారు ", మనము ఎంత సంతోషంలో ఉన్న కూడా మనలోని విప్లవాగ్ని ఎపుడో వొకసారి రగుల్తుంది అలాంటి సమయములో ఇలాంటి గొప్పవాణ్ణి గుర్తుకు వస్తారనే తపన తో ఈ పోస్ట్ చేస్తున్నాను ....అభిప్రాయాలూ తెలుపగలరు

చిన్న సవరణ నేను ముందు పోస్ట్ చేసిన దానిలో నన్ను మాత్రమె చంపగలరు అని రాసాను కాని నిజంగా చే చివరి మాటలు " మనిషిని మాత్రమె చంపగలరు (విప్లవాన్ని కాదు) అని " .

ఈ తప్పు తెలిపినందుకు సరస్వతి కుమార్ గారికి దన్యవాదములు ....దయచేసి మన్నిస్తారని చిన్ని ఆశ

you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"

చేగువేరా జీవిత గమనాన్ని చిత్రాల రూపంలో :


అతను జీవించడానికి రాలేదు , జీవించలేక మరణించే వాళ్లకి జీవిత గమనాన్ని నేర్పడానికి వచ్చాడు




మోటార్ సైకిల్ యాత్ర కోసం బయలుదేరుతూ

అత్యంత సన్నిహితుడు ఫిడెల్‌ కాస్ట్రోతో

అలుపెరుగని చే



క్యూబన్ పార్లమెంటులో




చే హత్యగావింపబడిన స్కూల్ లో టిచర్ జూలియా




విప్లవ కెరటాన్ని అర్పివేసిన teran






చే తన చివరి శ్వాసని పీల్చిన స్కూల్ భవనం







చే మృతదేహాన్ని తరలిస్తున్న హెలికాఫ్టర్








ఆపరేషన్ లో పాల్గొన్న అప్పటి బోలివియన్ సైన్యం



భంది గా దొరికిన చే ని ఒక గంటలో ఒక గంటలో చంపే ముందు ,మొక్కవోని గుండె దైర్యంతో మహాశయుడు





నేలకొరిగిన ద్రువతార





చే


you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"

Saturday, August 16, 2008

ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళపై లెక్క పెట్టుకునేలా ,వేల్లునుకు పోయి విన్న సమాచార వ్యవస్థలలో ఐడియా కుడా ఒకటి .ద్దపు కొన్ని లక్షల మంది హృదయాలలో సుస్థిర స్తానాన్ని సంపాదించి , కాదు కాదు కొన్ని లక్షల జీవితాలు మార్చి కొన్ని కోట్ల మంది ఆంద్రులకు తోడ్బాటు కా నిలుస్తోంది ,ఎందుకంటే ఐదే పేరు వినగానే మొదట స్ఫురించే పదం " మీ జీవితాన్ని మార్చేస్తుంది ",ఇపుడు ఐదెఅ కి సిని రంగానికి సంభందం ఏమిటి అనుకుంటున్నారా , ఒక చిన్న వ్యంగ సారుప్యత వుంది ....

ఐడియా మీ జీవి తాన్నే మార్చేస్తుంది అనే పదం ఎలా వచ్చిందంటే ....."మన తెలుగు చలన చిత్ర సీమలో అల్ టైం గ్రేట్ గా ఉన్న "మిస్సమ్మ" సినిమా గురించి తెలియని వారుండరు ,అందులో N.T.R గారికి,సావిత్రి గారికి, రేలంగి గారికి మద్య ఓ పార్కులో సన్నివేశం వుంటుంది . అక్కడ గారు N.T.R గారు సావిత్రి గారితో " ఒక్క ఐడియా ప్రపంచాన్నే మార్చేస్తుంది ,అంతెందుకు మీ దేవుడు యెహోవా కి ఐడియా రాకపోతే ఈ ప్రపంచం వుండేదా ..." అని అంటారు అది అలా వచ్చింది ఐడియా స్లోగను మన తెలుగు రత్న గారి వాక్కునుండి .......

ఇకపోతే మరో విషయం ఏంటంటే IDEA అనగానే మనకు లలలా లలలా లలల లలల అని వొక శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది .....

గ్రేట్ దర్శకుడు మణిరత్నం తన తొలి పరిచయాన్ని కన్నడలో పల్లవి అను పల్లవి అనే సినిమా ద్వారా చేసినప్పుడు ,ఆ సినిమా కి మ్యూజిక్ ఇళయరాజా గారి సమక్షంలో చేశారు , ఇందులో సాగే వొక పాట "నగువా నాయనా మధురా మౌన " ఆధారంగా ఐడియా మ్యూజిక్ నీ చేశారు , ఈ సినిమా తరువాత అదే పేరుతొ తెలుగులోకి కుడా డబ్ చేసారు అందులో మన తెలుగు పాట ఇలా సాగుతుంది " కనులు కనులు..."



ఈ విదంగా ఐడియా ద్వారా సిని రంగానికి , వ్యాపార రంగానికి సారుప్యత వుంది ....

you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"

Sunday, August 10, 2008

ఉచితంగా sms మీ నంబర్ నుండి వచినట్టుగా

ఇంతవరకు మనం నెట్ నుండి మొబైల్ కి మెసేజ్ పంపడానికి రకరకాల సైట్ లని వాదము కాని వాటిలో message from అనే అంశము సైట్ పేరే వస్తుంది ex: 160by2.com,way2sms.com,లాగా,కాని ఈ http://www.freesms8.com/ సైట్ లో message from అనే అంశము మన మొబైల్ నెంబర్ గానే వస్తుంది దీనివల్ల మెసేజ్ ఎక్కడనుండి వస్తోందో ఈజీ గ తెలుసుకోవచు ...మరియు మన స్నేహితులకు కూడా ఇబ్బందిగా లేకుండా ఎక్కడనుండి వచిందో తెలుస్తూంది ...ఇంకేఉంది ప్రయత్నించి చూడండి.. login అవ్వండి ఇలా ..... ఫై చిత్రంలోని new user దగ్గర క్లిక్ చేయండి ....



possward mee మొబైల్ కి పంపబడుతుంది .....
you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"


Friday, August 8, 2008

అతణ్ని చంపేయడాన్నివాళ్లు చూపించారు

వాళ్లు చనిపోయి అతను జీవించడం మనం చూశాం

-ఆంధ్రజ్యోతి దిన పత్రిక (08-01-07)

you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"

Thursday, August 7, 2008

భూకైలాస్
గాత్రం:సుశీల

సాహిత్యం:సముద్రాల

పల్లవి:సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము

అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా

ఆనంద లోకాలు చూపింతురా

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము

అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా

ఆనంద లోకాలు చూపింతురా

చరణం1:కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో

మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రాద

కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో

మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రాద

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము

అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా

ఆనంద లోకాలు చూపింతురా

చరణం2:యోగము చేదు విరాహము చేదు అనురాగమే మధురం

చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము

యోగము చేదు విరాహము చేదు అనురాగమే మధురం

చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము

అట రంగారు బంగారు మీనాలమై

కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం

అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం

ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం

ముదమార తనివీర ఈదాడుదాం

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము

అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా

ఆనంద లోకాలు చూపింతురా

సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ సుందరాంగ సుందరాంగఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

మిస్సమ్మ
తారాగణం:రామారావు,నాగేశ్వరరావు,ఎస్.వి.రంగారావు,సావిత్రి,జమున,రేలంగి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

సాహిత్యం: పింగళి

గాత్రం: ఏ.ఎం.రాజా, పి.సుశీల

నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డిదర్శకత్వం:ఎల్.వి.ప్రసాద్

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలేబృందావనమది

అందరిది గోవిందుడు అందరి వాడేలే

ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే

ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

చరణం1:పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

చరణం2:రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే

ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలేగోవిందుడు అందరి వాడేలే

పల్లవి:

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

చరణం1:నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా

ఈ పువ్వులనే నీ నవ్వులుగా

ఈ చుక్కలనే నీ కన్నులుగా

నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా

ఊహల్లొ తేలీ ఉర్రూతలూగిమేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

చరణం2:నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా

ఉండి లేక ఉన్నది నీవే

ఉన్నా కూడా లేనిది నేనే

నా రేపటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా

నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకైవేచాను నీ రాకకై .......

Wednesday, August 6, 2008

సూత్రధారులు
తారాగణం:నాగేశ్వరరావు,మురళిమోహన్,భానుచందర్,సుజాత,రమ్యకృష్ణ

దర్శకత్వం:కె.విశ్వనాథ్

సoగీతం:కెవి.మహదేవన్

నిర్మాతలు:సుధాకర్,కరుణాకర

విడుదల:1989

ఆరాధన

ఆరాధన
తారాగణం:చిరంజీవి,రాజశేఖర్,సుహాసిని,రాధిక

గాత్రం:బాలు,జానకి

సాహిత్యం:వేటూరి

సంగీతం:ఇళయరాజా

దర్శకత్వం:భారతీరాజా

పల్లవి:అరె ఏమైందీ అరె ఏమైందీఅరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ

కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ

అది నీలో మమతను నిద్దురలేపిందిఆ ఆ ఆ

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ

చరణం1:నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ

నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది

పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు

నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు

కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో

కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో

అది దోచావో ఓ ఓ ఓ

లలలలలా లలల ల ల ల ల ల ల ల ల లలలలా

చరణం2:బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది

పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది

గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు

మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు

రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో

చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు

మనిషౌతాడు ఉ ఉ ఉ

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ

కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీఅది నీలో మమతను నిద్దురలేపింది

అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ