Pages

Subscribe:

Thursday, July 24, 2008


ఇక్కడ ఒక ప్రముఖులైన గురువులు, గుంటూరు వాస్తవ్యుల ఫొటో కూడా లభ్యమైంది. దత్తోపాసకులైన ఈ గురువులు ఒకసారి షిర్డి వెళ్ళినప్పుడు తీసిన ఫొటో గా చెప్పారు. ఇందులో చిత్రం ఏమిటంటే ఫొటో తీస్తున్నపుడు లేని ఒక కాషాయ వస్త్ర ధారి (సాయి బాబాలా వున్నారు) ఫొటోలో వచ్చారు, ఈ గురువుల వెనుక. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు సేకరించవలసి వుంది.

ఏది ఏమైనా సాధన వల్ల, మంత్రదేవతోపాసన వల్ల సిద్ధులు కలుగుతాయని, యోగసాధన వల్ల ఆరోగ్యం, శాంతి కలుగుతాయని చెపుతున్నారు. మనం తినే తిండి కంటే పీల్చే గాలి ముఖ్యమైనది. పరిశుభ్రమైన గాలి ఆరోగ్యానికి మంచిది. కాని అది ఈనాడు కరువైపోతున్నది. భోపాల్లో యూనియన్ కార్బైడ్ దుస్సంఘటన ప్రపంచం మర్చిపోలేనిది. విష వాయువుల వల్ల లక్షమందికి పైగా దెబ్బ తినడం జరిగింది, ఎంతోమంది మరణించారు కూడా. కాని అంత భయంకర మైన సంఘటన మధ్యలో ఒక కుటుంబం మాత్రం క్షేమంగా మామూలుగా వుంది, ఈ విషయం ఆనాటి హిందు పేపర్లోనూ వచ్చింది. మరి ఈ కుటుంబం ఆ విషవాయువుల బారినుండి ఎలా బయటపడింది? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు గాయత్రీ హోమం చేస్తున్నారుట!

0 Comments:

Post a Comment